సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం “సరిలేరు నీకెవ్వరు” సినిమా టీమ్ అందరికీ ఒక మంచి పార్టీ ఇచ్చి విష్ చేసారు, మహేష్ సతీమణి నమ్రత. మహేష్ చేసే ప్రతీ సినిమాకు సంబంధించి, అనేక రకాలుగా వారిని సపోర్ట్ చేసే నమ్రత గారు ఈ సారి సరిలేరు.. సినిమాకు పని చేసిన ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్స్ తో సరదాగా గడిపారు. ఇక ఈ పార్టీలో హీరోయిన్ లు రష్మిక, తమన్నా, డైరెక్టర్ అనిల్ రావిపూడి, గీత రచయిత రామ జోగయ్య శాస్త్రి, సంగీత, విజయశాంతి, డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఇలా అందరూ కలిసి సందడి చేసారు.ఇక సినిమాకు సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ తనదైన స్టైల్ లో అందరినీ అలరించాడు.
ఇక ఈ ఫోటోలను నమ్రత, తమన్నా సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఇక ఇప్పటికే సరిలేరు .. సినిమా పై భారీ అన్చాన్లు ఉన్నాయి. ఇక ట్రైలర్ లో కూడా కామెడీ, లవ్, మాస్ ఇలా అన్ని అంశాలను మేళవించారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉంది, పార్టీకి రాలేకపోయిన సినిమా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ రత్నవేలు గారిని మిస్ అవుతున్నామని, ఆయనతో కలిసి ఈ నెల 11 సినిమా రిలీజ్ రోజు ఇంకా పెద్ద పార్టీ చేసుకుందామని నమ్రత అన్నారు.