నాగార్జున – ధనుష్ ల కాంబినేషన్ లో భారీ ఎత్తున మల్టీస్టారర్ చిత్రాన్ని చేయడానికి రెడీ అయ్యాడు ధనుష్ . ప్రారంభం కూడా అయ్యింది ఈ సినిమా కట్ చేస్తే రెగ్యులర్ షూటింగ్ ఇంతకీ ప్రారంభం కావడం లేదు దాంతో ఈ సినిమా ఆగిపోయింది అని వినబడుతోంది . పవర్ పాండి చిత్రంతో దర్శకుడిగా సూపర్ హిట్ కొట్టిన ధనుష్ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెలుగు , తమిళ బాషలలో రూపొందించడానికి సన్నాహాలు చేసాడు .
ఈ సినిమాని నిర్మించడానికి తేనాండాల్ ఫిలిమ్స్ ముందుకు వచ్చింది , అయితే ఆ సంస్థ నుండి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఇక ఈ మల్టీస్టారర్ చిత్రం ఆగిపోయినట్లే అని అంటున్నారు . ఎందుకంటే తాజాగా ధనుష్ అసురన్ అనే కొత్త సినిమా ప్రారంభిస్తున్నాడు . దాంతో ఈ అనుమానాలు వస్తున్నాయి . ఇక నాగార్జున కూడా బాలీవుడ్ గెస్ట్ రోల్ లో బ్రహ్మాస్త్ర అనే సినిమాలో నటించాడు తప్ప మరో తెలుగు సినిమా ఏది కూడా ప్రకటించలేదు . ఆర్భాటంగా ప్రారంభమైన ఈ మల్టీస్టారర్ చిత్రం ఉందా ? లేదా ? అన్నది తెలియాలంటే ఎవరో ఒకరు నోరు విప్పాల్సిందే .
English Title: Nagarjuna and Dhanush multistarrer shelved