రేయ్ పృథ్వీ ……. అంటూ మెగా బ్రదర్ నాగబాబు వార్నింగ్ ఇచ్చాడు . రేయ్ నాకు నువ్ ఫోన్ చెయ్ అప్పుడు ఆ విషయం చెబుతాను …… నా నెంబర్ నీ దగ్గర ఉంది ఫోన్ చెయ్ అంటూ హుకుం జారీ చేసాడు నాగబాబు . 30 ఇయర్స్ పృథ్వీ కి నాగబాబు వార్నింగ్ ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా ……. పవన్ కళ్యాణ్ జనసేన కు విరాళాలు ఇవ్వడమే ! నాగబాబు 25 లక్షలు ,వరుణ్ తేజ్ కోటి రూపాయల విరాళం ఇచ్చారు . అయితే అది బ్లాక్ మనీ అని పృథ్వీ కామెంట్ చేయడమే ఈ వివాదానికి కారణం .
మేము ఇచ్చింది బ్లాక్ మనీ కాదని వైట్ అంటూ చెప్పడమే కాకుండా కావాలంటే నా అకౌంట్ ని అలాగే వరుణ్ బాబు ఎకౌంట్ ని చెక్ చేసుకోవచ్చు అంటూ అసహనం వ్యక్తం చేసాడు . మీకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు వాడు పృథ్వీ నాకు ఫోన్ చేస్తే వాడికే చెబుతాను అంటూ వేలెత్తి మరీ ప్రిథ్వి కి వార్నింగ్ ఇచ్చాడు నాగబాబు . 30 ఇయర్స్ పృథ్వీ ఇటీవలే వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన విషయం తెలిసిందే .
English Title: Nagababu warning to prithvi