`ఫిదా` బ్లాక్ బస్టర్ హిట్తో సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల మళ్ళీ ట్రాక్లోకి వచ్చారు. ఈ సినిమా ఆయన కెరీర్లోనే అత్యధిక వసూళ్లని సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. వరల్డ్ వైడ్గా 50 కోట్లకు మించి వసూళ్లని రాబట్టి నిర్మాత దిల్ రాజుకు భారీ లాభాల్ని తెచ్చిపెట్టింది. దీంతో దర్శకుడిగా శేఖర్ కమ్ముల రేంజ్ పెరిగింది. అయినా సరే తన సెన్సిబిలిటీస్ని పక్కన పెట్టి సినిమా చేయడానికి అంగీకరించని ఆయన తాజాగా మరో బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ లవ్స్టోరీని తెరపైకి తీసుకొస్తున్నాడు.
నాగచైతన్య హీరోగా, `ఫిదా` చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసిన సాయిపల్లవి హీరోయిన్గా `లవ్స్టోరీ` పేరుతో శేఖర్ కమ్ముల ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో చై ఓ మధ్య తరగతి యువకుడిగా అత్యంత సహజత్వంతో కూడిన పాత్రలో కనిపించబోతున్నారు. ఇటీవలే టైటిల్ లుక్ని రిలీజ్ చేసిన మేకర్స్ ఈ నెల 13న ఈ చిత్రానికి సంబంధించిన తొలి సింగిల్ ` హే పిల్లా ` అంటూ సాగే సాంగ్ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసి పోస్టర్ ఆకట్టుకుంటోంది. నాగచైతన్య పక్కన నడుస్తూ ముసి ముసి నవ్వులు రువ్వుతున్న సాయి పల్లవి లుక్ అలరిస్తోంది.
తెలంగాణ గ్రామీణ ప్రాంతం నుంచి సిటీకి వచ్చిన ఓ జంట కథగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తనకు బ్లాక్ బస్టర్ హిట్ని అందించిన నిజామాబాద్ పల్లెలనే ఈ చిత్రానికి శేఖర్ కమ్ముల ఎంచుకున్నారు. అయితే సినిమా ప్రేమకథే అయినా సాడ్ ఎండింగ్ వుంటుందని, అది హృదయాల్ని పిండేసేలా వుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. అమిగోస్ క్రియేషన్స్ పై శేకఱ్ కమ్ముల దర్శకత్వంలో వహిస్తూ పుస్కూర్ రామ్మోహన్రావు, నారాయణ్ దాస్ కె. నారంగ్తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు సమ్మర్కు రిలీజ్ కానుంది.