కరోనా భయంతో సెట్స్కి వెళ్లడానికి స్టార్ హీరోలంతా భయపడుతుంటే కింగ్ నాగార్జున మాత్రం టార్చ్ బేరర్ తరహాలో ముందుకొచ్చారు. బిగ్బాస్ సీజన్ 4 కోసం ధైర్యంగా ముందడుగేశారు. ఆ తరువాత వెంటనే తను నటిస్తున్న `వైల్డ్ డాగ్` చిత్ర షూటింగ్ని కూడా మొదలుపెట్టారు. ఇది మిగతా హీరోల్లో ధైర్యాన్ని నింపింది. తన తండ్రి ధైర్యం ఇవ్వడంతో అక్కినేని హీరో నాగచైతన్య కూడా సెట్లోకి ఎంటరవుతున్నారు.
నాగచైతన్య నటిస్తున్న తాజా చిత్రం `లవ్స్టోరీ`. 15రోజుల షూటింగ్ మినహా పూర్తయింది. కరోనా కారణంగా ఆగిపోయింది. బ్యాలెన్స్గా వున్న షూటింగ్ని పూర్తి చేసి చిత్రాన్ని రిలీజ్ చేయాలని చాలా రోజులుగా దర్శకుడు శేఖర్ కమ్ముల ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ కరోనా భయంతో వెనకడుగు వేస్తూ వస్తున్నారు. తాజాగా సోమవారం (సెప్టెంబర్ 7) రెగ్యులర్ షూటింగ్ని ప్రారంభిస్తున్నామంటూ చిత్ర బృందం ప్రకటన విడుదల చేసింది.
మాక్జిమమ్ 15 మంది యూనిట్ సభ్యులతో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ షూటింగ్ చేస్తామని, సింగిల్ షెడ్యూల్లో బ్యాలెన్స్ షూట్ని పూర్తి చేస్తామని, థర్మల్ స్క్రీనింగ్ తరువాతే సెట్లోకి యూనిట్ సభ్యుల్ని అనుమతిస్తున్నామని ప్రకటించారు చిత్ర బృందం.