Homeటాప్ స్టోరీస్మైత్రి మూవీస్ బ్యానర్ లో అఖిల్ చిత్రం

మైత్రి మూవీస్ బ్యానర్ లో అఖిల్ చిత్రం

మైత్రి మూవీస్ బ్యానర్ లో అఖిల్ చిత్రం
మైత్రి మూవీస్ బ్యానర్ లో అఖిల్ చిత్రం

అక్కినేని అఖిల్ తన కెరీర్ లో మూడు సినిమాలు చేసినా ఇంకా తొలి విజయాన్ని అందుకోలేదు. తన నాలుగో చిత్రంతో అది దక్కుతుందని నమ్మకంగా ఉన్నాడు అఖిల్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో పూజ హెగ్డే హీరోయిన్ గా అఖిల్ నాలుగో చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ మొదలవుతోంది. ఇంకా ఈ సినిమాకు సంబంధించి ఒక పాటను చిత్రీకరించాల్సి ఉంది.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే అఖిల్ తన ఐదవ సినిమాగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ ను చేస్తోన్న విషయం తెల్సిందే. వచ్చే నెల నుండి ఈ సినిమా షూటింగ్ మొదలవుతుంది. ఇదిలా ఉంటే అఖిల్ అక్కినేనికు టాప్ ప్రొడక్షన్ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఎప్పుడో అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారు.

- Advertisement -

ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు రూపాంతరం చెందుతోంది. కామెడీ చిత్రాలతో తనకంటూ ఒక మార్క్ ను క్రియేట్ చేసిన శ్రీను వైట్ల దర్శకత్వంలో అఖిల్ ఈ ప్రాజెక్ట్ ను చేస్తాడు. అఖిల్, శ్రీను వైట్లలకు ప్రస్తుతమున్న కమిట్మెంట్స్ పూర్తయ్యాక ఈ చిత్రాన్ని చేయనున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All