Homeటాప్ స్టోరీస్ఏకంగా స‌ల్మాన్‌ఖాన్‌నే ప‌ట్టేశారుగా!

ఏకంగా స‌ల్మాన్‌ఖాన్‌నే ప‌ట్టేశారుగా!

ఏకంగా స‌ల్మాన్‌ఖాన్‌నే ప‌ట్టేశారుగా!
ఏకంగా స‌ల్మాన్‌ఖాన్‌నే ప‌ట్టేశారుగా!

టాలీవుడ్ లో వున్న టాప్ ఫిల్మ్ ప్రొడ‌క్ష‌న్ కంపెనీల్లో మైత్రీ మూవీమేక‌ర్స్ లీడింగ్‌లో వుంది. చిన్నా, పెద్దా అని లేడా లేకుండా వ‌రుస చిత్రాల్ని నిర్మిస్తోంది. 2015లో మ‌హేష్ హీరోగా కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `శ్రీ‌మంతుడు` సినిమాతో ఈ బ్యాన‌ర్ మొద‌లైంది. హిట్‌లు, ఫ్లాప్‌లు ఎన్నో చూసిన ఈ సంస్థ చేతిలో ప్ర‌స్తుతం మూడు చిత్రాలున్నాయి. అల్లు అర్జున్‌, సుకుమార్‌ల‌తో ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లో హ‌రీష్‌శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాన్ హీరోగా ఓ భారీ చిత్రాన్ని ప్రారంభించ‌బోతున్నారు.

సాయిధ‌ర‌మ్‌తేజ్ త‌మ్ముడు పంజా వైష్ణ‌వ్‌తేజ్‌ని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ `ఉప్పెన‌` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూడు చిత్రాల త‌రువాత ఈ సంస్థ బాలీవుడ్ చిత్రాల నిర్మాణం చేప‌ట్ట‌బోతోంది. ఇందు కోసం `మైత్రీ మూవీమేక‌ర్స్‌ 2` అనే పేరుతో కొత్త బ్యాన‌ర్‌ని ఇప్ప‌టికే రిజిస్ట‌ర్ చేయించిన‌ట్టు తెలిసింది. మైత్రీని ముగ్గురు నిర్మాత‌లు న‌వీన్ యెర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి, మోహ‌న్ చెరుకూరి ప్రారంభించారు. బాలీవుడ్ ప్రాజెక్ట్‌ల‌కు మాత్రం మోహ‌న్ చెరుకూరి దూరంగా వుండ‌బోతున్నార‌ని తెలిసింది.

- Advertisement -

మిగ‌తా ఇద్ద‌రైన న‌వీన్ యెర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి మ‌రో బాలీవుడ్ నిర్మాత‌తో క‌లిసి తొలి ప్ర‌య‌త్నంగా స‌ల్మాన్‌ఖాన్‌తో సినిమా చేయ‌బోతున్నార‌ట‌. తొలి సినిమా కోసం ఏకంగా స‌ల్మాన్‌ని ప‌ట్టేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్ప‌టికే స‌ల్మాన్ స‌న్నిహితుడు అతుల్ అగ్నిహోత్రికి వెల్ల‌డించార‌ని, స‌ల్మాన్ స‌మాధానం కోసం ఎదురుచూస్తున్నార‌ని తెలిసింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All