నిన్న రాత్రి విడుదలైన మిస్టర్ మజ్ను ట్రైలర్ యావరేజ్ గా ఉంది , దాంతో ఈ సినిమా అయినా హిట్ అవుతుందా ? అన్న అనుమానం నెలకొంది . అక్కినేని అఖిల్ – నిధి అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ” మిస్టర్ మజ్ను ”. తొలిప్రేమ వంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన వెంకీ అట్లూరి ఈ మిస్టర్ మజ్ను చిత్రానికి దర్శకత్వం వహించాడు దాంతో ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి .
అయితే ట్రైలర్ మాత్రం యావరేజ్ గా ఉండటంతో సినిమా హిట్ అవుతుందా ? అన్న అనుమానం నెలకొంది . అఖిల్ సోలో హీరోగా నటించిన రెండు చిత్రాలు కూడా హిట్ కాలేదు దాంతో ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు .
నిన్న సాయంత్రం అక్కినేని అభిమానుల సమక్షంలో ప్రీ రిలీజ్ వేడుక జరిగింది . మిస్టర్ మజ్ను చిత్రాన్ని జనవరి 25 న విడుదల చేస్తున్నారు . ప్రేమకథా చిత్రం కాబట్టి అఖిల్ భారీగానే ఆశలు పెట్టుకున్నాడు మరి .