భారతీయ జనతా పార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ కి ఘోర అవమానం జరిగింది . భారతీయ జనతా పార్టీ తాజా లిస్ట్ లో గాంధీనగర్ నుండి మరోసారి అద్వానీ పోటీ చేయకుండా టికెట్ నిరాకరించారు . నిన్న ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో అద్వానీ పేరు లేకపోవడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది . భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈస్థాయిలో ఉందంటే కారణం లాల్ కృష్ణ అద్వానీ చేసిన సాహసమే !
అద్వానీ రథయాత్ర ఒక్కసారిగా దేశ రాజకీయాలను మార్చేసింది . కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన భారతీయ జనతా పార్టీని అజేయమైన శక్తిగా మార్చాడు . ఇక నరేంద్ర మోడీ ని రాజకీయంగా ఎదిగేలా చేసింది అద్వానీయే ! అయితే మోడీ ప్రధాని అయ్యాక మెల్ల మెల్లగా అద్వానీని పక్కన పెట్టాడు . ఇక ఇప్పుడేమో ఏకంగా అద్వానీ కి టికెట్ కూడా నిరాకరించి సంచలనం సృష్టించారు . శిష్యుడు మోడీ నే గురువు ని పక్కన పెట్టడంతో అద్వానీ కి ఘోర అవమానం జరిగిందని వాపోతున్నారు రాజకీయ విశ్లేషకులు .
English Title : Modi insults again Advani