Homeటాప్ స్టోరీస్డ్రగ్స్ పార్టీ చేసుకున్నారని ఆరోపణలు

డ్రగ్స్ పార్టీ చేసుకున్నారని ఆరోపణలు

Karan Johar
Karan Johar

బాలీవుడ్ దిగ్గజం కరణ్ జోహార్ ఇచ్చిన పార్టీలో పాల్గొన్న బాలీవుడ్ ప్రముఖులు డ్రగ్స్ తీసుకున్నారని అందుకు ఈ వీడియోనే సాక్ష్యం అంటూ కరణ్ జోహార్ తీసిన వీడియోనే పోస్ట్ చేసాడు శిరోమణి అకాలీదళ్ ఎం ఎల్ ఏ మజిందర్ సింగ్ సిర్సా . ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది . ఈ వీడియోలో మలైకా అరోరా , అర్జున్ కపూర్ , షాహిద్ కపూర్ , దీపికా పదుకోన్ , రణ్ బీర్ కపూర్ , మీర్జా రాజ్ పుత్ , వరుణ్ ధావన్ , నటాషా దలాల్ తదితరులు ఉన్నారు . ఇక వీడియో తీసింది కరణ్ జోహార్ .

అయితే ఈ వీడియోలో ఉన్నవాళ్లు దాదాపుగా మత్తులో ఉన్నారు అంటే మద్యం సేవించి ఉండొచ్చు లేదంటే ఎం ఎల్ ఏ చెప్పినట్లు డ్రగ్స్ తీసుకొని ఉండైనా ఉండొచ్చు . అయితే ఆ సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకోలేదు అందుకు నేనే సాక్ష్యం ఎందుకంటే ఆ పార్టీకి నా భార్య కూడా వెళ్ళింది అని అంటున్నాడు కాంగ్రెస్ నాయకుడు మిలింద్ డియారా . అంతేకాదు ఆ వీడియో లో ఉన్న అందరికీ క్షమాపణ చెప్పాల్సిందే అని పట్టుబడుతున్నాడు . అయితే ఈ ఇద్దరి వాదన ఎలా ఉన్నా బాలీవుడ్ ప్రముఖులు మాత్రం కాస్త మత్తులో ఉన్నారు అన్నది వాస్తవం.

- Advertisement -

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All