అర్జున్ రెడ్డి చిత్రంలో నటించిన రాహుల్ రామకృష్ణ ఒక్కసారిగా ఆ సినిమా బ్లాక్ బస్టర్ సాధించడంతో తిరుగులేని హాస్య నటుడిగా మారాడు . అయితే రాహుల్ రామకృష్ణ పై మిఠాయి దర్శకుడు ప్రశాంత్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేసాడు . మహేష్ బాబు ని తక్కువ చేసి మాట్లాడతాడని , నాతో కూడా పలుమార్లు ఈ విషయం చెప్పాడని అలాగే ఇతరుల ముందు కూడా చాలాసార్లు గొప్పగా చెప్పుకున్నాడని సంచలన ఆరోపణలు చేసాడు .
భరత్ అనే నేను చిత్రంలో రాహుల్ రామకృష్ణ రాయలసీమ ప్రాంతం వ్యక్తిగా నటించిన విషయం తెలిసిందే . అయితే సినిమాలో మహేష్ బాబు – రాహుల్ రామకృష్ణ ల మధ్య కొన్ని సన్నివేశాలు మాత్రమే ఉన్నాయి కానీ చిత్రీకరించిన సన్నివేశాలు మాత్రం ఎక్కవే నట ! అయితే ఆ సన్నివేశాల్లో మహేష్ నటన కంటే రాహుల్ నటన బాగుందట అందుకే అసూయపడిన మహేష్ ఆ సన్నివేశాలను తొలగించాడని అందరికీ చెప్పుకుంటున్నాడట రాహుల్ రామకృష్ణ . ఇది ఎంతవరకు నిజమో కానీ మిఠాయి చిత్రంలో నటించిన రాహుల్ ఆ సినిమా రిలీజ్ సమయంలో ఇద్దరి మధ్య విబేధాలు తలెత్తాయి దాంతో ఈ గొడవలు .