మా ఎలక్షన్ ఫైట్ లో ప్రకాష్ రాజ్ టార్గెట్ చేసిన జెనీలియాని రప్పించి షాక్ ఇచ్చాడు మంచు విష్ణు. ఆమె మాత్రమే కాదు ముంబై, చెన్నై, ఢిల్లీ నుండి వచ్చి మరి మా ఓటింగ్ లో పాల్గొన్నారు. ప్రకాష్ రాజ్ కామెంట్స్ ను తిప్పికొట్టేలా మంచు విష్ణు వేసిన ప్లాన్ వర్క్ అవుట్ అయిందని చెప్పొచ్చు. అయితే ప్రకాష్ రాజ్ కు సపోర్ట్ గా నిలిచిన మెగా బ్రదర్ నాగబాబు తన సొంతింటి వాళ్లను కూడా వచ్చి ఓట్ వేయించలేకపోయాడు.
నాగబాబు తనయుడు వరుణ్ తేజ్, తనయురాలు నిహారిక ఇద్దరు మా సభ్యులే.. వరుణ్ తేజ్, నిహారిక ఇద్దరు తండ్రి సపోర్ట్ చేస్తున్న ప్రకాష్ రాజ్ కు వచ్చి ఓట్ వేసే అవకాశం ఉంది. కాని వారిద్దరు ఆదివారం జరిగిన ఓటింగ్ లో పాల్గొనలేదు. కనీసం ఇంట్లో వాళ్లని కూడా వచ్చి తను సపోర్ట్ ఇచ్చిన వారిని గెలిపించమని నాగబాబు డిమాండ్ చేయలేకపోయాడు.
ప్రకాష్ రాజ్ ఓటమికి నాగబాబు ఒక కారణమని కొందరు అంటున్నారు. డైరెక్ట్, ఇన్ డైరెక్ట్ అన్నది పక్కన పెడితే మెగా సపోర్ట్ తో ప్రకాష్ రాజ్ గెలవడం ఖాయమని అంతా భావించారు. కాని తెలుగు వాదం ఒక్కటి ప్రకాష్ రాజ్ ను వెనక్కి నెట్టేసింది. ఆ ప్రాతిపదికమీదే మా సభ్యులు ప్రకాష్ రాజ్ ను అధ్యక్షుడిగా ఎన్నుకోలేదని చెప్పొచ్చు.