
మెగాస్టార్ చిరంజీవి – రామ్ చరణ్ లు నటిస్తున్న ఆచార్య మూవీ తాలూకా ట్రైలర్ ను మంగళవారం సాయంత్రం విడుదల చేసి అభిమానుల్లో పూనకాలు తెప్పించారు. ముందుగా ఈ మూవీ ట్రైలర్ ని 153 థియేటర్లలో చిత్ర బృందం సాయంత్రం 5:49 నిమిషాలకు విడుదల చేశారు. ఆ తర్వాత సోషల్ మీడియా లో విడుదల చేసారు. కాగా ఈ ట్రైలర్ టాలీవుడ్ లో పలు రికార్డ్స్ సృష్టిస్తుంది.
యూట్యూబ్ లో విడుదలై 24గంటల్లోనే 24 మిలియన్ వ్యూస్ దక్కించుకొని , తెలుగు చిత్రసీమలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న ట్రైలర్ గా నిలువగా..తాజాగా వన్ మిలియన్ లైక్స్ , 26 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో దుమ్ములేపుతున్నట్లు మేకర్స్ అధికారికంగా తెలిపారు. మెగా అభిమానులంతా ఎలాంటి అంశాలని అయితే కోరుకుంటున్నారో అదే తరహా ఎమోషన్ యాక్షన్ అంశాలతో ట్రైలర్ ఉండడం తో సినిమా ఫై మరింత అంచనాలు పెరిగాయి. మరి సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.
MASSive 1 Million Likes with 26M+ views for the Mighty #AcharyaTrailer ?#1MLikesForAcharyaTrailer ?
Get ready for the next big update?
Megastar @KChiruTweets @AlwaysRamCharan #Sivakoratala @hegdepooja @SonuSood @NavinNooli @MatineeEnt @KonidelaPro pic.twitter.com/20kbWzN7Cw
— BA Raju's Team (@baraju_SuperHit) April 15, 2022