ది గ్రేట్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియిన్ సెల్వన్`. గత కొన్నేళ్లుగా ఈ భారీ ప్రాజెక్ట్ని తెరపైకి తీసుకురావాలని మణిరత్నం చేయని ప్రయత్నం లేదు. టైటిల్ పాత్రలో మహేష్ని తీసుకుని ముందు ప్రారంభించాలనుకున్నారు. కానీ మేకర్స్ బడ్జెట్కు భయపడి వెనక్కి తగ్గడంతో మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ కథ మళ్లీ మొదటికి వచ్చింది. ఆ తరువాత లైకా ప్రొడక్షన్స్ అధినేత అల్లిరాజా సుభాస్కరన్ ముందుకు రావడంతో మళ్లీ ఆశలు చిగురించాయి. అయితే `2.ఓ` దెబ్బతీయడంతో బడ్జెట్లో కోతలు విధించిన సుభాస్కరన్ చివరికి ఈ ప్రాజెక్ట్కి గ్రీన్సిగ్నల్ ఇచ్చేశారు.
లైకా ప్రొడక్షన్స్తో కలిసి మద్రాస్ టాకీస్ బ్యానర్పై మణిరత్నం నిర్మిస్తూ కూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. ప్రముఖ రచయిత కల్కీ కృష్ణమూర్తి నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఛోళరాజ్యాధినేత కథగా పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం రూపొందుతోంది. దీనికి సంబంధించిన ఫస్ట్లుక్ టైటిల్ పోస్టర్ని మేకర్స్ గురువారం సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టర్లో ఆర్టిస్ట్లు ఎవరూ లేరు. పొన్నియిన్ సెల్వన్ ఖడ్గాన్ని మాత్రమే పోస్టర్లో చూపిస్తూ మణిరత్నం తొలి సారి టైటిల్ని ఇంగ్లీష్లో డిజైన్ చేయించడం ఆసక్తికరంగా మారింది.
`బిగ్ స్క్రీన్పై స్వర్ణయుగం ప్రారంభానికి సాక్ష్యంగా నిలవడానికి మీరు సిద్ధంగా వున్నారా? అనే మాటలతో టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ని మద్రాస్ టాకీస్ అఫీషియల్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేయడం ఆకట్టుకుంటోంది. ఆదిత్య కరికాలన్గా విక్రమ్, నందిని, మందాకిని దేవిగా ద్విపాత్రాభినయంలో ఐశ్వర్యారాయ్, అరుళ్ మెళివర్మన్గా జయం రవి, వల్లవరాయ వందియ దేవన్గా కార్తి, కుందవాయిగా త్రిష కీలక పాత్రల్లో నటిస్తున్నారు.