వెర్సటైల్ దర్శకుడు మణిరత్నం అటు తమిళ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ లో కూడా తగినంత పేరు సంపాదించుకున్నాడు. తన సినిమాలతో ఎప్పటికప్పుడు ఆసక్తి కలిగించే మణిరత్నం లేటెస్ట్ గా నవరస అనే వెబ్ సిరీస్ ను నిర్మించాడు. తమిళ్ లో 9 మంది దర్శకులు 9 కథలను డైరెక్ట్ చేసారు. రీసెంట్ గా ఈ నవరస వెబ్ సిరీస్ టీజర్ కూడా విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఇదిలా ఉంటే మణిరత్నం తనకు సూపర్ స్టార్ మహేష్ బాబుతో పనిచేయాలన్న ఆసక్తిని బయటపెట్టాడు. కొన్నేళ్ల క్రితం మణిరత్నంతో మహేష్ బాబు పనిచేస్తాడన్న ప్రచారం జరిగింది. అప్పట్లో హైదరాబాద్ కూడా వచ్చాడు. అయితే ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ అవ్వలేదు. మణిరత్నం ఈ విషయంపై స్పందించాడు.
“మహేష్ తో పనిచేయాల్సి ఉంది. గతంలో ప్రయత్నించా కానీ వర్కౌట్ అవ్వలేదు. భవిష్యత్తులో మంచి కథ దొరికితే కచ్చితంగా తనతో పనిచేయాలని ఉంది” అని మణిరత్నం సెలవిచ్చాడు. సినిమాల పరంగా పొన్నియన్ సెల్వన్ డైరెక్ట్ చేస్తున్నాడు మహేష్.