Homeటాప్ స్టోరీస్మోహన్ బాబు ఇంట తీవ్ర విషాదం

మోహన్ బాబు ఇంట తీవ్ర విషాదం

Manchu mohan babu mother manchu lakshmamma passes awayమంచు మోహన్ బాబు ఇంట తీవ్ర విషాదం నెలకొంది . మోహన్ బాబు తల్లి మంచు లక్ష్మమ్మ (85) ఈరోజు ఉదయం ఆరు గంటలకు తిరుపతి లోని శ్రీ విద్యానికేతన్ లో కన్నుమూశారు . తల్లి మరణించిందన్న విషయం మోహన్ బాబుకి తెలియడంతో వెంటనే విదేశాల నుండి రావడానికి సమాయత్తం అయ్యాడు . మోహన్ బాబు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు , తల్లి మరణ వార్త విన్న మోహన్ బాబు కన్నీరు మున్నీరు అయ్యాడట !

లక్ష్మమ్మ మరణంతో మోహన్ బాబు ఇంట విషాదం నెలకొంది . కాగా మోహన్ బాబు ఈరోజు ఇండియాకు తిరిగి వస్తుండటంతో రేపు అంత్యక్రియలు ఘనంగా నిర్వహించడానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు . నాన్నమ్మ మరణంతో మంచు లక్ష్మీ , మంచు విష్ణు , మంచు మనోజ్ లు షాక్ అయ్యారు . అందరు తిరుపతికి చేరుకుంటున్నారు . మోహన్ బాబు తల్లి మరణించిందన్న విషయం తెలియడంతో పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసారు .

- Advertisement -

English Title: Manchu mohan babu mother manchu lakshmamma passes away

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All