మంచు మోహన్ బాబు విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , హీరోగా , కమెడియన్ గా విభిన్న పార్శ్వాలను స్పృశించాడు . ఎన్నో భారీ విజయాలను అందుకున్నాడు అలాగే భారీ పరాజయాలను చవిచూశాడు కూడా , కానీ 42 ఏళ్ల నటప్రస్థానంలో తొలిసారిగా ఓ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు ఎందుకంటే చాలాకాలంగా మోహన్ బాబు కు కమర్షియల్ హిట్ లేదు . తాజాగా మదన్ దర్శకత్వంలో గాయత్రి అనే చిత్రంలో నటించాడు అంతేకాదు సొంత చిత్రం కూడా కావడంతో ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నాడు .
ఇప్పుడు కొత్తగా సక్సెస్ కోసం ఎందుకు తహతహలాడుతున్నాడంటే సక్సెస్ లోని మజా యే అది . మోహన్ బాబు చూడని సక్సెస్ లు లేవు ఒక దశలో వరుస విజయాలతో స్టార్ హీరోలకు ముచ్చెమటలు పోయించాడు కానీ అదంతా గతం , వర్తమానం లో సక్సెస్ లేదు అందుకే గాయత్రి విజయాన్ని కోరుకుంటున్నాడు . మోహన్ బాబు రెండు షేడ్స్ ఉన్న పాత్రలను పోషిస్తున్న ఈ చిత్రంలో మంచు విష్ణు తో పాటు శ్రియా కూడా నటించింది . ఇక ఈ గాయత్రి సినిమా ఈనెల 9న విడుదల అవుతోంది .