Homeటాప్ స్టోరీస్సెన్సార్ కార్యక్రమాల్లో బిజీగా "మళ్ళీ మళ్ళీ చూశా"

సెన్సార్ కార్యక్రమాల్లో బిజీగా “మళ్ళీ మళ్ళీ చూశా”

సెన్సార్ కార్యక్రమాల్లో బిజీగా "మళ్ళీ మళ్ళీ చూశా"
సెన్సార్ కార్యక్రమాల్లో బిజీగా “మళ్ళీ మళ్ళీ చూశా”

కంటెంట్ బాగుండి సరైన పద్దతిలో ప్రమోషన్ చేస్తే సినిమా చిన్నదా పెద్దదా అన్నది చూడట్లేదు ప్రేక్షకులు. ఈ మధ్య కాలంలో ఈ రకంగా సూపర్ హిట్ సాధించిన ఎన్నో చిన్న చిత్రాలను మనం చూసాం. మా చిత్రం కూడా అదే కోవలోకి చెందుతుంది అంటున్నారు “మళ్ళీ మళ్ళీ చూశా” చిత్ర యూనిట్.

“జీవితంలో అందరూ కోరుకునే ప్రాధమిక హక్కు స్వేచ్ఛ. తనకు నచ్చినట్లుగా తనని బ్రతకనివ్వడం. ఇక ప్రతీ ప్రేమికుడు ఒక సైనికుడితో సమానం. యుద్ధంలో సైనికుడు పోరాడితే, తన ప్రేమను గెలిపించుకోవడానికి మా కథలో హీరో ఎలాంటి పోరాటం చేసాడో చిత్రం చూసి తెలుసుకోవాలి” అంటున్నారు చిత్ర దర్శకుడు హేమంత్ కార్తీక్.

- Advertisement -

అనురాగ్ కొణిదెన హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్వేతా అవస్థి, కైరవి తక్కర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీత దర్శకుడు. కె. కోటేశ్వరరావు నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ ముగించుకోవడంతో గుమ్మడికాయ కూడా కొట్టారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను ముగించుకుని అక్టోబర్ లోనే చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోలు త్వరలోనే విడుదల కానున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All