Homeగాసిప్స్మరో ఆప్షన్ లేక అతనికే ఫిక్స్ అయిన మహేష్

మరో ఆప్షన్ లేక అతనికే ఫిక్స్ అయిన మహేష్

మరో ఆప్షన్ లేక అతనికే ఫిక్స్ అయిన మహేష్
మరో ఆప్షన్ లేక అతనికే ఫిక్స్ అయిన మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన 26వ చిత్రం చిత్రీకరణలో బిజీగా మారిన సంగతి తెల్సిందే. నవంబర్ లోనే ఈ చిత్ర షూటింగ్ పూర్తైపోతుంది. సంక్రాంతికి అంటే జనవరి 12న ఈ సినిమా విడుదలవుతుంది. మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా కోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గత కొన్ని చిత్రాల నుండి మహేష్ కమర్షియల్ అంశాలను, ఫ్యాన్స్ కోరికలను పక్కనపెట్టి అతి మంచివాడి పాత్రలు పోషిస్తూ వస్తున్నాడు. సరిలేరు నీకెవ్వరులో కూడా మంచి వాడి పాత్రే అయినా కానీ ఇందులో కమర్షియల్ అంశాలకు కొదవ లేదు. దర్శకుడు అనిల్ రావిపూడి ఈ విషయంలో పక్కాగా ఉంటాడు. కమర్షియల్ అంశాలకు లోబడి చిత్రాన్ని చేస్తాడు. తన గత చిత్రాలను చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. అలాగే అనిల్ రావిపూడి చిత్రాలంటే ఎంటర్టైన్మెంట్ పక్కా. కడుపుబ్బా నవ్విస్తాడు. ఈ నేపథ్యంలో సరిలేరు నీకెవ్వరు తమకు ఫుల్ మీల్స్ పెట్టే చిత్రమని మహేష్ అభిమానులు నమ్ముతున్నారు. దానికి తగ్గట్లే సరిలేరు నీకెవ్వరు టీమ్ కూడా అంచనాలను అంతకంతకూ పెంచేస్తోంది. ఈ సినిమా చూస్తే కడుపు చెక్కలవ్వడం ఖాయం అనే పదాన్ని ప్రతి ఒక్కరూ వాడుతున్నారు.

ఇక ఈ సినిమా సంగతి పక్కనపెడితే నవంబర్ లోనే ప్రస్తుత సినిమా షూటింగ్ పూర్తైపోతున్నా మహేష్ వెంటనే నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టట్లేదు. ఈసారి మూడు నుండి నాలుగు నెలలు బ్రేక్ తీసుకోవడం పక్కా అని తెలుస్తోంది. దీనికి కారణం మహేష్ తో టచ్ లో ఉన్న దర్శకులెవరూ ప్రస్తుతం ఖాళీగా లేరు. సందీప్ వంగా స్క్రిప్ట్ కు మహేష్ కొన్ని మార్పులు సూచించాడు. అయితే ఈలోగా బాలీవుడ్ నుండి సందీప్ కు పిలుపొచ్చింది. అటు చెక్కేసాడు. పరశురామ్ చెప్పిన కథను మహేష్ వద్దనుకున్నాడు. అనిల్ రావిపూడి కథ చెప్పినా సరిలేరు నీకెవ్వరు విడుదలైతే కానీ ఏ విషయం తేల్చలేడు. అనుభవం తక్కువున్న దర్శకుడితో చేయడానికి మహేష్ సిద్ధంగా లేడు. దీంతో వంశీ పైడిపల్లితోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. మహర్షి తర్వాత మరో సినిమా చేస్తానని మాట ఇచ్చాడు మహేష్. తనకెవరైనా దర్శకుడు నచ్చితే వారితో మళ్ళీ మళ్ళీ చేయడానికి ఇష్టపడతాడు మహేష్. అయితే మహర్షి చేసిన తర్వాత మరో సినిమా గ్యాప్ కూడా లేకుండా వంశీ పైడిపల్లి మళ్ళీ మహేష్ కే కథ సిద్ధం చేస్తున్నాడు.

- Advertisement -

అయితే వంశీ పైడిపల్లి సినిమా అంటే మహేష్ ఫ్యాన్స్ కు కొంత కంగారుగా ఉంది. మహర్షి హిట్టయినా కానీ అది అన్ని వర్గాలని మెప్పించిన సినిమా అయితే కాదు. మహేష్ అభిమానులు కూడా కొంత మంది ఈ చిత్రంపై తమ అసంతృప్తి వ్యక్తం చేసారు. పైగా వంశీ పైడిపల్లి బాగా స్లో. పూరి జగన్నాథ్, అనిల్ రావిపూడిలా చాలా ఫాస్ట్ గా సినిమాలు తీసే దర్శకులంటే ఫ్యాన్స్ ఇష్టపడతారు. కానీ వంశి పైడిపల్లి స్క్రిప్ట్ కు, మేకింగ్ కు చాలా టైమ్ తీసుకుంటాడు. ఈ లెక్కన వచ్చే వేసవికే వంశీ పైడిపల్లి – మహేష్ సినిమా పట్టాలెక్కుతోంది. అప్పటిదాకా మహేష్ ఖాళీనే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All