Homeగాసిప్స్డిసెంబర్ వరకూ సర్కారు వారి పాట లేనట్లే?

డిసెంబర్ వరకూ సర్కారు వారి పాట లేనట్లే?

డిసెంబర్ వరకూ సర్కారు వారి పాట లేనట్లే?
డిసెంబర్ వరకూ సర్కారు వారి పాట లేనట్లే?

ప్రభుత్వం నుండి షూటింగులకు అనుమతులు వచ్చినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. కరోనా పాజిటివ్ కేసులు ఇంతకీ తగ్గుముఖం పట్టకపోవడంతో హీరోలలో, దర్శకులలో భయం పెరుగుతోంది. షూటింగులకు అనుమతులు వచ్చినా కానీ తాము హాజరుకాలేమని హీరోలు ఖరాఖండీగా చెప్పేస్తున్నారు. ఇప్పటికే కొంత మంది హీరోలు ఈ తరహా ప్రకటనలు చేయగా ఇప్పుడు మహేష్ కూడా ఇదే బాటలో నడుస్తున్నట్లు తెలుస్తోంది.

డిసెంబర్ దాకా సినిమా షూటింగ్ మొదలుపెట్టవద్దని తన టీమ్ కు మహేష్ చెప్పినట్లుగా వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు తన 27వ సినిమా వివరాల్ని ఇటీవలే వెల్లడించిన సంగతి తెల్సిందే. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట చేయనున్నాడు మహేష్. ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఎంపిక చేసిన విషయం కూడా ఇటీవలే వెల్లడైంది.

- Advertisement -

ఆగష్టు నుండి ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెడదామని పరశురామ్ అండ్ కో భావిస్తుండగా మహేష్ నుండి ఈ కబురు వచ్చినట్లుగా తెలుస్తోంది. సో డిసెంబర్ నుండి షూటింగ్ మొదలయ్యేలా షెడ్యూల్స్ వేయనున్నారు. ఈలోగా పరిస్థితులు అదుపులోకి వస్తే ఏమైనా ఆలోచించే అవకాశం ఉంటుందేమో మరి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All