సూపర్ స్టార్ మహేష్ పరశురాం కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సకారు వారి పాట. ఫస్ట్ లుక్ టీజర్ తోనే సినిమాపై అంచనాలు పెంచిన పరశురాం ఈ సినిమాతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు మరిచిపోని సూపర్ హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు. సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుంది. ఇప్పటికే థమన్ సినిమా కోసం అద్భుతమైన సాంగ్స్ ఇచ్చాడని టాక్.
ఇక ఇదిలాఉంటే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా 2022 సంక్రాంతి రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. అయితే అనూహ్యంగా పొంగల్ రేసులో రాజమౌళి ఆర్.ఆర్.ఆర్, ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాలతో పాటుగా పవన్, రానాలు కలిసి చేస్తున్న భీమ్లా నాయక్ లు కూడా వస్తున్నాయి. జనవరి 7న ట్రిపుల్ ఆర్.. 14న రాధే శ్యాం, 13న భీంలా నాయక్ లు రిలీజ్ ఎనౌన్స్ చేశారు.
అందుకే సంక్రాంతి రేసు నుండి మహేష్ సర్కారు వారి పాట తప్పుకుంటున్నట్టు తెలుస్తుంది. సంక్రాంతి నుండి ఈ సినిమా సమ్మర్ కి షిఫ్ట్ అయినట్టు చెప్పుకుంటున్నారు. ఏప్రిల్ లో మహేష్ సర్కారు వారి పాట రిలీజ్ ఉంటుందని టాక్. పోకిరి రిలీజ్ డేట్ ఏప్రిల్ 28న సర్కారు వారి పాట రిలీజ్ ఉంటుందని అంటున్నారు. మరి ఈ రిలీజ్ వాయిదా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ బయటకు రావాల్సి ఉంది.