సూపర్ స్టార్ మహేష్ మరో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడా అంటే ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం అవుననే అని అంటున్నారు. ఆల్రెడీ స్టార్ హీరోగానే కాదు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్న మహేష్ మల్టీప్లెక్స్ బిజినెస్ లోకి దిగాడు. ఏ.ఎం.బి సినిమాస్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో తెలిసిందే. ఇక లేటెస్ట్ గా మహేష్ మరో కొత్త బిజినెస్ కు రంగం సిద్ధం చేస్తున్నాడని తెలుస్తుంది.
కరోనా వల్ల ఆన్ లైన్ ఎడ్యుకేషన్.. ఈ లెర్నింగ్ యాప్స్ కు బాగా డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో బైజూస్ వంటి యాప్స్ బాగా పాపులర్ అయ్యాయి. మహేష్ కూడా బైజూస్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నాడు. అయితే మరి అది చూసినప్పుడు వచ్చిన ఆలోచనో ఏమో కాని మహేష్ కొత్త ఈ లెర్నింగ్ యాప్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాడట.
మహేష్ ఈ లెర్నింగ్ యాప్ బిజినెస్ మీద ఫోకస్ పెట్టాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే దీనికి సంబందించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది.