దేశ వ్యాప్తంగా కేసులతో పాటు మరణాలూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వున్న ప్రజల్ని కాపాడాలంటే లాక్ డౌన్ ఒక్కటే మార్గమని నమ్మిన కేంద్ర ప్రభుత్వం మే 3 వరకు లాక్ డౌన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో సెలబ్రిటీలంతా ఇళ్లకే పరిమితం అయిపోయారు. ఇంటి పట్టునే వుంటూ పిల్లలతో కాలక్షేపం చేస్తున్నారు.
స్టార్ హీరో ప్రిన్స్ మహేష్ కూడా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని తన ఇంటిలోనే వుంటూ పిల్లతో కాలక్షేపం చేస్తున్నారు. మహేష్కు ఇద్దరు పిల్లలు గౌతమ్, సితార. లాక్ డౌన్ సమయం నుంచి మహేష్కి వీళ్లతోనే సరిపోతోంది. తాజాగా గౌతమ్తో కలిసి వర్చువల్ టెన్నిస్ ఆడారు మహేష్. దీనికి సంబంధించిన వీడియోని షోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు.
మహేష్ తనయుడితో కలిసి టెన్నిస్ ఆడుతున్న వీడియో అభిమానుల్ని ఓ రేంజ్లో ఆకట్టుకుంటోంది. వర్చువల్ టెన్నిస్ అయినా మహేష్ తనయుడితో పోటీపడి మరీ ఆడుతున్న తీరుకు ఫ్యాన్స్ మంత్ర ముగ్ధులవుతున్నారు. త్వరలో పరశురామ్ దర్శకత్వంలో మహేష్ ఓ భారీ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే.