డిజిటల్ ఓటీటీల హవా మొదలైంది. ఎవరు చూసినా సొంత ఓటీటీ అంటూ ప్రయత్నాలు మొదలుపెట్టేశారు. ఇప్పటికే మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మైహోమ్ రామేశ్లరరావు భాగస్వామ్యంలో `ఆహా` పేరుతో ఓటీటీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పటికే చాలా సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయితే ఇదే తరహాలో ఓ స్టార్ హీరో సొంతంగా ఓటీటీని ప్రారంభించబోతున్నారంటూ వార్తలు షికారు చేయడం మొదలైంది.
ఆ స్టార్ హీరో మరెవరో కాదు మహేష్బాబు. త్వరలో స్టార్ హీరో మహేష్ కూడా సొంతంగా డిజిటల్ ఓటీటీ ని ప్రారంభించబోతున్నారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల మహేష్ మల్టీప్లెక్స్ థియేటర్స్ బిజినెస్లోకి ప్రవేశించడం, తను నటించే చిత్రాలకు కో ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తుండటంతో మహేష్ సొంతంగా ఓటీటీని ప్రారంభిస్తున్నారంటూ వార్తలు పుట్టుకురావడం మొదలైంది.
అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, మహేష్ సొంతంగా ఓటీటీని ప్రారంభించడం లేదని తాజాగా మహేష్ వర్గం నుంచి క్లారిటీ వచ్చేసింది. పైగా తను పరశురామ్తో చేయబోతున్న చిత్రం కరోనా క్రైసిస్ ముగియగానే మొదలు కాబోతోందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.