మహేష్ `సరిలెరు నీకెవ్వరు` చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించి మహేష్ కెరీర్ లోనే సరికొత్త చరిత్రని సౄష్టించింది. బ్యాక్ టూ బ్యాక్ మహర్షి , సరిలెరు నీకెవ్వరు బంటి చిత్రాలు హిట్ లావడంతో ఫ్యామిలీతో కలిసి యూ ఎస్ వెల్లిన మహేష్ అక్కడె ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు.
తిరిగి ఇండియా వచ్చిన తరువాత వంశి పైడిపల్లితో సినిమా చెస్తానని మహేష్ చెప్పారు కాని సమీకరణాలన్ని మారిపొవడం.. పైడిపల్లి సినిమాని పక్కన పెట్టడం చక చక జరిగి పోయాయి. వంశి పైడిపల్లి స్థానం లో `గీత గోవిందం` ఫేం పరశురాం లైన్లొకి వచ్చాడు. మహేష్ తన తదుపరి చిత్రాన్ని అతనితోనే చేయబోతున్నాడు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించ నున్న ఈ మూవీకి ముహూర్తం ఫిక్ష్ చెసినట్టు తెలిసింది. ఈనెల 13 లెదా 14న ముహూర్తం జరపబోతున్నారు. ఉగాది నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెడతారట. దీనికి సంబందించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలొనే మేకర్స్ చేయబోతున్నట్టు తెలిసింది.