టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా మహర్షి చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ముగ్గురు నిర్మాతలు నిర్మిస్తున్నారు . అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తోంది . ఇక మొన్న సాయంత్రం రామోజీ ఫిలిం సిటీలో షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది మహర్షి చిత్రం .
మహేష్ బాబు తో పాటుగా పలువురు నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారట దర్శకులు వంశీ పైడిపల్లి . బిజినెస్ మెన్ గా కాలేజ్ స్టూడెంట్ గా విభిన్న పార్శ్వాలలో మహేష్ బాబు కనిపించనున్నాడట మహర్షి చిత్రంలో . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు విభిన్నమైనవి కావడంతో ఈ సినిమాపై కూడా అంచనాలు బాగానే ఉన్నాయి . భరత్ అనే నేను చిత్రంతో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించాడు మహేష్ , ఆ సినిమా తర్వాత వస్తున్న చిత్రం కావడంతో మహర్షి పై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి . ఇక ఈ సినిమాని 2019 ఏప్రిల్ 5 న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు .
English Title: Mahesh Maharshi Ramoji film city schedule wrapped up