ఒకవైపు ఐటీ శాఖాధికారులు ఇక్కడ మహేష్ బాబు బ్యాంక్ ఖాతాలను జప్తు చేస్తుంటే అక్కడేమో మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి ఫారిన్ లో ఎంజాయ్ చేస్తున్నాడు . అయితే ఐటీ అధికారుల తీరు మహేష్ బాబు కి ఎలా ఉందో కానీ మహేష్ అభిమానులను మాత్రం తీవ్ర గందరగోళానికి నెట్టేసింది . మహేష్ పై ఇలా పగ సాధించడం ఏంటి ? అంటూ షాక్ అవుతున్నారు మహేష్ బాబు అభిమానులు.
మహేష్ ఫ్యాన్స్ ఆందోళనగా ఉన్నారు కానీ మహేష్ కానీ అతడి కుటుంబం కానీ హాయిగా ఫారిన్ లో ఎంజాయ్ చేస్తున్నారు ఎంచక్కా . తాజాగా తన కుటుంబంతో కలిసి ఓ రెస్టారెంట్ లో దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . క్రిస్మస్ , నూతన సంవత్సర వేడుకల కోసం విదేశాలకు వెళ్ళాడు మహేష్ బాబు . అయితే అదే సమయంలో జి ఎస్ టి పన్ను అది కూడా 2007 – 2008 నాటి కాలందని మహేష్ బ్యాంక్ ఖాతాలను సీజ్ చేయడమే కాకుండా 42 లక్షలను డ్రా చేసుకున్నారు కూడా .
English Title: Mahesh enjoying in farine