Homeటాప్ స్టోరీస్గోవాలో యాక్షన్ పార్ట్ ఇరగదీస్తోన్న మహేష్

గోవాలో యాక్షన్ పార్ట్ ఇరగదీస్తోన్న మహేష్

గోవాలో యాక్షన్ పార్ట్ ఇరగదీస్తోన్న మహేష్
గోవాలో యాక్షన్ పార్ట్ ఇరగదీస్తోన్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట చిత్రంలో నటిస్తోన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. హైదరాబాద్ లో మినీ షెడ్యూల్ ను పూర్తి చేసిన తర్వాత ఇప్పుడు గోవాకు షిఫ్ట్ అయింది. గోవాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారు. రామ్ – లక్ష్మణ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ బ్లాక్ ను చిత్రీకరిస్తున్నారు. మరికొన్ని రోజుల పాటు గోవాలోనే షూటింగ్ కొనసాగిస్తారు.

ఆగస్ట్ 9న విడుదలైన సర్కారు వారి పాట టీజర్ అద్భుత రెస్పాన్స్ ను సంతరించుకుంది. మహేష్ లుక్స్, మ్యానరిజమ్స్ ఫ్యాన్స్ కు భలే నచ్చేసాయి. పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -

సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం విడుదలవుతునని అధికారికంగా వెల్లడించారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All