చిన్నారులను దేవుడి రూపంలో ఆదుకున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఒక్కరోజులోనే 30 మంది చిన్నారుల ప్రాణాలను కాపాడారు. ఇప్పటికే వేల ప్రాణాలను తన సొంత డబ్బుతో చిన్నారులకు గుండే ఆపరేషన్ చేయించిన మహేష్ బాబు..తన పేరు మీద ప్రారంభించిన ఫౌండేషన్ ద్వారా తన సహాయా సహకారాలను మరింతగా విస్తరింపజేశారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మరో అద్భుతమైన కార్యానికి ఆయన శ్రీకారం చుట్టారు.
‘మహేశ్ బాబు ఫౌండేషన్’ పేరుతో చిన్నారులను కాపాడుతున్నారు. ఆ బాధ్యతలను మహేశ్ సతీమణి నమ్రత చూసుకుంటుంది. తాజాగా ఆమె చిన్నారుల గుండె సంబంధిత ఆపరేషన్స్ గురించి ఓ ఫొటో షేర్ చేసింది. సదరు ఫొటోకు ఆమె ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. ఒకే రోజులో 30 మంది చిన్నారుల గుండె ఆపరేషన్ చేయించినట్లుగా తెలిపింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ ఆపరేషన్స్ చేయించినట్లు పేర్కొంది.
ఈ కార్యక్రమాన్ని ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ చేతుల మీదుగా ప్రారంభించినట్లు వివరించింది. ఇందులో భాగస్వామ్యం అయిన ఆంధ్రా హాస్పిటల్ కు థాంక్స్ చెప్పింది. ఈ విషయం తెలుసుకుని మహేశ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.