తాజాగా మహేష్ బాబు తన 25 వ సినిమాని డెహ్రాడూన్ లో ప్రారంభించిన విషయం తెలిసిందే . నిన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాగా ఆ లొకేషన్ కు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి వెళ్లి మహేష్ ని కలిసిన విషయం కూడా విదితమే ! కాగా ఈ సినిమా ప్రారంభం కాకముందు నుండే వివాదం లో ఇరుక్కుంది . ఈ సినిమా దర్శకుడు వంశీ పైడిపల్లి కాగా అతడు పివిపి కి సినిమా చేయాలనీ రెడీ చేసుకున్నాడు కథ , అయితే పివిపి స్థానంలో ఇద్దరు నిర్మాతలు అశ్వనీదత్ – దిల్ రాజులు వచ్చి చేరారు దాంతో పివిపి చెన్నై కోర్టు ని ఆశ్రయించాడు .
పివిపి ని బుజ్జగిస్తున్నట్లు మాట్లాడుతూనే మరోవైపు సినిమా ప్రారంభం కావడంతో ఆగ్రహంతో ఉన్నాడు పివిపి . కాగా రేపు హైదరాబాద్ లో అశ్వనీదత్ – దిల్ రాజు – పివిపి ల మధ్య చర్చలు జరుగనున్నాయట ! ఈ చర్చలు ఓ కొలిక్కి వస్తే ….. వివాదం ముగిసినట్లే ! లేదంటే మరింతగా ముదురుతోంది దాంతో మహేష్ తో పాటు అశ్వనీదత్ , దిల్ రాజు , పివిపి లు అందరూ సఫర్ అవుతారు . రేపు జరిగే చర్చల్లో పురోగతి ఉంటుందా ? వివాదం సద్దుమణుగుతుందా ? అన్నది తేలనుంది ఎందుకంటే కోర్టు 21న అఫిడవిట్ దాఖలు చేయమంది కాబట్టి .