రెండు భారీ చిత్రాలు ఒకేరోజున రిలీజ్ కావడం వల్ల అటు బయ్యర్ల తో పాటుగా ఇండస్ట్రీ వాళ్ళు సైతం చాలామంది నష్టపోయే ప్రమాదం ఉందని తెలియడంతో వెంటనే పలువురు సినీ ప్రముఖులు రంగంలోకి దిగి రాజీ చర్చలు కొనసాగించారట ! లాభ నష్టాలను సవివరంగా వివరించి చెప్పడంతో మొత్తానికి మహేష్ బాబు – అల్లు అర్జున్ లు రాజీ కొచ్చారట ! ఇరువురు దర్శక నిర్మాతలు కూడా పట్టు వీడటంతో రాజీ ఫార్ములా కుదిరిందని అంటున్నారు .
ఆ రాజీ ఫార్ములా ప్రకారం మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం మొదటగా విడుదల అవుతుంది . ఏప్రిల్ 27 అనుకోని ఆ తర్వాత ఏప్రిల్ 26 అని ప్రకటించారు కానీ ఇప్పుడు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఏప్రిల్ 22 నే భరత్ అనే నేను విడుదల కానుంది ఇక మే 5న అల్లు అర్జున్ నటించిన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా విడుదల కానుంది . ఇలా రెండు వారాల గ్యాప్ తీసుకోవడం వల్ల ఇద్దరికీ మంచిదని అంటున్నారు పరిశ్రమ వర్గాలు .