Homeటాప్ స్టోరీస్మహానటి కి అన్యాయం జరుగనుందా ?

మహానటి కి అన్యాయం జరుగనుందా ?

గత ఏడాది విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం ” మహానటి ”. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన మహానటి చిత్రానికి దర్శకుడకు నాగ్ అన్వేష్ అన్న విషయం తెలిసిందే . కేవలం తెలుగు ప్రేక్షకుల చేత మాత్రమే కాకుండా యావత్ సినీ ప్రేక్షకుల చేత నీరాజనాలు అందుకున్న చిత్రం మహానటి . అయితే ఇలాంటి గొప్ప చిత్రానికి అన్యాయం జరగనుందా ? అంటే అవుననే వినిపిస్తోంది .

- Advertisement -

వచ్చే నెలలో జాతీయ అవార్డులు ప్రకటించనున్నారు అయితే ఆ అవార్డుల కోసం మహానటి ,రంగస్థలం , చిత్రాలతో పాటు పలు చిత్రాలు పోటీ పడుతున్నాయి . మహానటి చిత్రంలో కీర్తి సురేష్ అద్భుత అభినయం ప్రదర్శించింది , అలాగే ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా నిలిచే అవకాశం కూడా ఉంది కానీ అవార్డుల ఫలితాల్లో మహానటి కి న్యాయం జరుగుతుందా ? అనే అనుమానం అయితే వ్యక్తం అవుతోంది . ఎందుకంటే రాజకీయ కోణం కూడా ఉంటోంది అవార్డుల ఎంపికలో . ఇప్పటికే పలుమార్లు అవార్డుల ప్రకటనలతో వివాదాలు చుట్టుముట్టాయి .మహానటి చిత్రాన్ని నిర్మించింది అశ్వనీదత్ , అతడు తెలుగుదేశం పార్టీ వ్యక్తి దాంతో మహానటి కి న్యాయం జరుగుతుందా ? అవార్డు వస్తుందా ? అన్నది ప్రశ్నగా మారింది మరి .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All