కేటీఆర్ సార్ ! మీ ప్రభుత్వ పనితీరు ఇదేనా ? హైదరాబాద్ నగరంలోనే వైద్యం అందక ఓ ప్రాణం పొతే ఇక జిల్లాల పరిస్థితి ఏంటి ?అంటూ తెలంగాణ ఐటీ శాఖా మంత్రి పై నిప్పులు చెరిగాడు మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ . మహానటి చిత్రం కోసం పనిచేసిన కెమెరామెన్ ఆదివారం రోజున హైదరాబాద్ లో రోడ్డు యాక్సిడెంట్ కి గురయ్యాడు . యాక్సిడెంట్ జరిగి గాయాల పాలు కావడంతో అతడ్ని సికింద్రాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారట . అక్కడ స్టెచర్ మీద తీసుకెళ్లే సిబ్బంది కూడా లేకపోవడంతో పాపం ఆ కెమెరామెన్ తల్లిదండ్రులే ఏడ్చుకుంటూ గాయాలపాలైన కొడుకుని చికిత్స కోసం డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు కూడా లేరు దాంతో మూడు గంటల పాటు ప్రాణాలతో విలవిలలాడి చనిపోయాడట .
ఇంకేముంది తన మిత్రుడు సకాలంలో వైద్యం అందకుండా చనిపోయాడని తెలుసుకున్న నాగ్ అశ్విన్ ప్రభుత్వ పనితీరు పట్ల , కేటీఆర్ పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నేరుగా కేటీఆర్ కు హ్యాష్ ట్యాగ్ చేసాడు . ఈ మహానగరంలో వైద్యం అందకుండా చనిపోవడం ఏంటి ? ఇదేనా మీ ప్రభుత్వ పనితీరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు నాగ్ అశ్విన్ . గాంధీ ఆసుపత్రి కాకుండా మరో ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే నా ఫ్రెండ్ బ్రతికేవాడు , నేను గొప్ప కెమెరామెన్ ని కోల్పోయాను అంటూ రోధిస్తున్నాడు మహానటి దర్శకుడు . దీనిపట్ల కేటీఆర్ ఎలా స్పందిస్తాడో చూడాలి .
English Title: Mahanati director Nag ashwin angry on ktr
my friend died in gandhi hospital on sunday. he was alive for 3 hours after they brought him from the accident. as it was sunday there was no proper care, the parents had to push the stretcher around themselves. at any other hospital 3 hours would have saved him.
— Nag Ashwin (@nagashwin7) November 27, 2018
what can we do @KTRTRS sir to make sure that the word ‘government hospital’ need not be synonymous with carelessness and death. my friend was easily one of the best cameramen we have in the state. i don’t know whom else to ask sir. nobody should die needlessly
— Nag Ashwin (@nagashwin7) November 27, 2018