Homeటాప్ స్టోరీస్సిద్ధం మనోహర్.. 'మహానటి' టు 'జాతి రత్నాలు'

సిద్ధం మనోహర్.. ‘మహానటి’ టు ‘జాతి రత్నాలు’

సిద్ధం మనోహర్.. 'మహానటి' టు 'జాతి రత్నాలు'
సిద్ధం మనోహర్.. ‘మహానటి’ టు ‘జాతి రత్నాలు’

ఎవరికైనా హార్డ్ వర్క్, డిసిప్లిన్, టాలెంట్ ఉంటే లక్ అనేది మనల్ని ఫాలో అవుతూ వస్తుందని నిరూపించాడు సిద్ధం మనోహర్. ప్రస్తుతం ఈ పేరు వింటే ఎవరు అనే సందేహం వచ్చినా త్వరలో అందరూ గుర్తించుకునే పేరు అవుతుందని నమ్మకంగా ఉన్నాడు మనోహర్. నేషనల్ అవార్డు విన్నింగ్ చిత్రం ‘మహానటి‘కి అసిస్టెంట్ కెమరామెన్ గా చేసాడు సిద్ధం మనోహర్. మహానటికి కెమరామెన్ గా డాని సాంచెజ్ – లోపెజ్ పనిచేసారు. తనకి అసిస్టెంట్ గా పనిచేసిన సిద్ధం మనోహర్ పనితనానికి ముగ్దుడైన మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ మనోహర్ కు అద్భుతమైన అవకాశమిచ్చాడు.

ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి వంటి సినిమాలతో దర్శకుడిగా మెప్పించిన నాగ్ అశ్విన్, నిర్మాతగా మారి చేస్తున్న తొలి ప్రయత్నం జాతి రత్నాలు. మహానటి వంటి చిత్రాన్ని అందించిన స్వప్న సినిమాస్ బ్యానర్ ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తుండడం విశేషం. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో తెలుగు వారికి దగ్గరైన నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ దాదాపు 75 శాతం పూర్తయినట్లు, నవంబర్ లో చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలున్నాయని మూవీ యూనిట్ తెలిపింది.

- Advertisement -

నిన్ననే ఈ చిత్ర మోషన్ పోస్టర్ కూడా విడుదలైంది. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముగ్గురూ ఖైదీ బట్టలో ఉండగా ముగ్గురికీ వరసగా చొక్కాపై 420, 210, 840 నంబర్లు ఉన్నాయి. పిట్టగోడ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనుదీప్ కెవి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని “ఫన్నీయస్ట్ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్”గా ప్రమోట్ చేస్తున్నారు. రధన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

మరి నేషనల్ అవార్డు గెలుచుకున్న దర్శకుడి నిర్మాణంలో, స్వప్న సినిమాస్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్ లో టాలెంటెడ్ నటులతో తెరకెక్కుతున్న జాతి రత్నాలు వంటి చిత్రంతో ‘డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ’గా తన మొదటి అడుగును వేయబోతున్న సిద్ధం మనోహర్ కు ఇది సువర్ణకాశమనే చెప్పాలి. తన టాలెంట్, నిబద్ధత, క్రమశిక్షణతో పిన్న వయసులోనే పెద్ద అవకాశాన్ని పొందిన సిద్ధం మనోహర్, తన కెమెరా కంటితో ఎలాంటి మాయ చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ చిత్రంలో హీరోగా చేస్తున్న నవీన్ పోలిశెట్టి వరస సక్సెస్ లతో మంచి ఊపుమీదున్నాడు. తెలుగులో ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో హిట్ కొట్టగా, హిందీలో చేసిన చిచ్చోరే కూడా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు జాతి రత్నాలతో తన సక్సెస్ ను కంటిన్యూ చేయాలని భావిస్తున్నాడు నవీన్. మరోవైపు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కలిసి చేసిన బ్రోచేవారెవరురా చిత్రం సూపర్ హిట్ అయిన నేపథ్యంలో ఈ సినిమాలో వీరు ఎంత కామెడీ చేస్తారన్నది కూడా ఆసక్తికరం. వీరికి సాయం మురళి శర్మ, నరేష్, తనికెళ్ళ భరణి వెన్నెల కిషోర్ వంటి టాలెంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు. చూద్దాం మరి ఈ జాతిరత్నాలు ఎంతటి నాణ్యత కలిగినవారో!

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All