మహా కూటమి తరుపున కూకట్ పల్లి అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేస్తున్న నందమూరి సుహాసిని వల్ల మహా కూటమి ఘనవిజయం సాధించడం ఖాయమని , తొలివిజయం కూకట్ పల్లి నుండి సుహాసిని సాధిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు . కూకట్ పల్లి తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంది . గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసిన మాధవరం కృష్ణారావు కి 99,874 ఓట్లు వచ్చాయి . అదే స్థానం నుండి టిఆర్ ఎస్ పోటీ చేయగా కేవలం 56,688 ఓట్లు మాత్రమే వచ్చాయి దాంతో తెలుగుదేశం అభ్యర్ధి 43 , 186 ఓట్ల మెజారిటీ తో గెలిచాడు . కట్ చేస్తే పరిస్తితులు మారిపోవడంతో టిఆర్ ఎస్ పార్టీలో చేరాడు మాధవరం కృష్ణారావు . తెలుగుదేశం పార్టీ కి ఇక్కడ ఉన్న ఓటు బ్యాంక్ ఏంటి ? దాని సత్తా ఏంటి ? అన్నది గత ఎన్నికల్లోనే చాటి చెప్పింది దాంతో తిరుగులేని స్థానం నుండి నందమూరి సుహాసిని ని పోటీకి నిలబెట్టారు చంద్రబాబు .
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చింది కానీ ప్రజలకు పూర్తిస్థాయిలో విశ్వాసం కలిగించలేకపోయాడు కేసిఆర్ . ప్రభుత్వం వచ్చిన తొలి నాళ్లలో చంద్రబాబు ని విమర్శిస్తే అర్ధం ఉంటుంది కానీ నాలుగున్నర సంవత్సరాలు పరిపాలించి ఇప్పుడు కూడా చంద్రబాబు పై విమర్శలు చేయడంతోనే కేసిఆర్ తన ఓటిమి ని అంగీకరించినట్లే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు . కూకట్ పల్లి నుండి నందమూరి సుహాసిని భారీ మెజారిటీ తో విజయం సాధించడం ఖాయమని తద్వారా మహాకుటమి తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ – తెలుగుదేశం వర్గాలు .
English Title: Mahakutami will gets power with nandamuri suhasini