Homeటాప్ స్టోరీస్మహా సముద్రం సక్సెస్ అందరికీ ముఖ్యమే!

మహా సముద్రం సక్సెస్ అందరికీ ముఖ్యమే!

మహా సముద్రం సక్సెస్ అందరికీ ముఖ్యమే!
మహా సముద్రం సక్సెస్ అందరికీ ముఖ్యమే!

ఆరెక్స్ 100 వంటి సెన్సేషనల్ సబ్జెక్ట్ తో డెబ్యూ చేసాడు దర్శకుడు అజయ్ భూపతి. తన తొలి సినిమా సక్సెస్ అయినా కూడా అజయ్ భూపతికి రెండో సినిమా కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. మహా సముద్రం స్క్రిప్ట్ తో చాలా మంది హీరోలని కలిసాడు. చివరికి శర్వానంద్, సిద్ధార్థ్ లను హీరోలుగా పెట్టి ఈ చిత్రాన్ని పూర్తి చేసాడు. హీరోయిన్లుగా అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ నటించారు. కీలక పాత్రల్లో రావు రమేష్, జగపతి బాబు కనిపిస్తారు.

దసరా సందర్భంగా ఈ చిత్రం అక్టోబర్ 14న విడుదలవుతోంది. థియేట్రికల్ ట్రైలర్ అత్యంత ఆసక్తికరంగా ఉండటంతో చిత్రంపై బజ్ రెట్టింపైంది. పండగ సందర్భంగా పాజిటివ్ వైబ్స్ తో విడుదలవుతోన్న మహా సముద్రం సక్సెస్ టీమ్ మొత్తానికి చాలా ముఖ్యం. ప్రస్తుతం శర్వానంద్ ఫామ్ సరిగా లేదు. రీసెంట్ సినిమాలు అనుకున్న రేంజ్ సక్సెస్ ను సాధించలేదు.

- Advertisement -

అలాగే సిద్ధార్థ్ దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత టాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇక అజయ్ భూపతికి తొలి సక్సెస్ తర్వాత తనను తాను నిలబెట్టుకోవడానికి ఈ చిత్ర సక్సెస్ చాలా ముఖ్యం. మహా సముద్రం కనుక సక్సెస్ అయితే అజయ్ టాప్ లీగ్ లోకి చేరడం ఖాయం. ఇటు అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు హైదరిలు కూడా పెద్ద లైమ్ లైట్ లో లేరు. కాబట్టి మహా సముద్రం సక్సెస్ కావడం టీమ్ మొత్తానికి చాలా అవసరం.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All