కరోనాకు రాజు పేద అనే తేడా తెలియదు. అంటోంది మాధవీత. వరల్డ్ మొత్తం కరోనా బారిన పడి విలవిలలాడుతోంది. ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలి? దీని బారిన పడకుండా ఎంత జాగ్రత్తగా వుండాలో వివరిస్తూ నటి మాదవీలత ఓ టిక్ టాక్ వీడియోని రూపొందించింది. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.
జీవితంలో ఎన్ని సాధించినా ఏదీ మనతో రాదని ఈ వీడియోతో మంచి సందేశాన్ని అందించింది. మొదటి అంకె నేను అని, మొదటి స్థానం నాది అని, మొదటి నుంచి విర్రవీగే మొదటి రకం పొగరుబోతా. భూమిపై స్థానం అంటే ప్రాణమని తెలుసుకో…ఇంట్లో వుండండి… జాగ్రత్తగా వుండండి.. అని మాధవీలత చెప్పిన దీరు పలువురిని ఆకట్టుకుంటోంది.
ఈ వీడియోని ఇప్పటికే 4.4 లక్షల మందికి పైగా వీక్షించారు. 35 వేల మంది లైక్ చేశారు. `ఒక్క నిమిషంలో జీవితం అంటే ఏంటో తెలియజేశారు. చాలా బాగా చెప్పారు. మీ కవిత చాలా బాగుందని నెటిజన్స్ మాధవీలతని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.