మా ఎలక్షన్స్ లో టఫ్ ఫైట్ లో మంచు విష్ణు ప్రెసిడెంట్ గా గెలిచి సత్తా చాటారు. ప్రకాష్ రాజ్ పై ఆయన ఘన విజయం సాధించారు. ఈసీ మెంబర్స్ లో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి 11 మంది.. మంచు విష్ణు ప్యానల్ నుండి 8 మంది గెలిచారు. ఇదిలాఉంటే ఈ గెలుపుతో మంచు విష్ణుపై మరింత బాధ్యత పెరిగిందని చెప్పొచ్చు. ఇచ్చిన మాట ప్రకారం మా బిల్డింగ్ కట్టించడమే కాకుండా తన మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్క పని చేసి చూపించే అవసరం ఉంది.
మంచు విష్ణు మేనిఫెస్టోలో చాలా విషయాలను ప్రస్థావించారు. ఆ మేనిఫెస్టోని రెండేళ్లలో పూర్తి చేస్తే మంచు విష్ణుని ఖచ్చితంగా అందరు మెచ్చుకునే అవకాశం ఉంది. పోరాడి గెలిచాడు.. అదేవిధంగా మాకి మంచి చేస్తాడా.. మా ఆర్టిస్టులకు చెప్పినట్టుగా అన్ని పనులు చేస్తాడా అన్నది చూడాలి. మంచు విష్ణు గెలుపులో అతని మేనిఫెస్టో కీలకంగా మారిన సమయంలో మంచు విష్ణు ఈ రెండేళ్ల టైం లో తను ఇచ్చిన హామీలన్ని నెరవేరుస్తాడా లేదా అన్నది తెలియాల్సి ఉంది. గెలవడమే కాదు ఆ పనులు కూడా చేసి శభాష్ అనిపించుకుంటే మంచు విష్ణుకి ఇక తిరుగు ఉండదు.