Homeటాప్ స్టోరీస్సుశాంత్ రూమ్‌లో ఎవ‌రా న‌లుగురు?

సుశాంత్ రూమ్‌లో ఎవ‌రా న‌లుగురు?

సుశాంత్ రూమ్‌లో ఎవ‌రా న‌లుగురు?
సుశాంత్ రూమ్‌లో ఎవ‌రా న‌లుగురు?

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్ప‌ద మృతి కేసు రోజుకో మ‌లుపు తిరుగుతోంది. సుశాంత్ కేసులో రోజుకో సంచ‌ల‌న విష‌యం వెలుగు చూస్తోంది. కంప్యూట‌రైజ్డ్ లాక్ వున్న సుశాంత్ రూమ్‌ని తెరిచిన లాక్ స్మిత్ మ‌హ‌మ్మ‌ద్ ర‌ఫీ తాజాగా సంచ‌ల‌న విష‌యాల్ని బ‌య‌ట‌పెట్టాడు. సుశాంత్ ఆత్మ హ‌త్య చేసుకున్న రోజు రాత్రి అత‌ని గ‌ది తాళాల‌ని ప‌గుల‌గొట్టి త‌లుపుని తానే తెరిచాన‌ని, ఆ గ‌దిలో న‌లుగురు వ్య‌క్తులు వున్నార‌ని, వారిలో ఎలాంటి భ‌యం క‌నిపించ‌లేదని కీల‌క విష‌యాన్ని బ‌య‌ట‌పెట్ట‌డం సంచ‌ల‌నం సృష్టిస్తోంది.

ఓ మీడియాతో మాట్లాడిన లాక్ స్మిత్ మ‌హ‌మ్మ‌ద్ ర‌ఫీ ఆ రోజు ఏం జ‌రిగిందో వెల్ల‌డించాడు. సుశాంత్ చ‌నిపోయిన రోజు 1:30 గంట‌ల ప్రాంతంలో త‌న‌కు ఫోన్ కాల్ వ‌చ్చింద‌ని, ఓ గ‌ది తాళం ప‌గుల గొట్టాల‌ని ఓ వ్య‌క్తి ఫోన్ చేశాడ‌ని, దీంతో అత‌ను చెప్పిన అడ్ర‌స్‌కు వెళ్లి ఆ గ‌ది తాళం ప‌గుల‌గొట్టాన‌ని, ఆ బెడ్ రూమ్ లాక్ కంపూట‌రైజ్డ్ లాక్‌. దీంతో ఆ తాళం ప‌గుల గొట్టినందుకు త‌న‌కు 2 వేలు ఇచ్చార‌ని, గ‌ది లోప‌ల ముగ్గురు నుంచి న‌లుగురు వున్నార‌ని, వారిలో ఎలాంటి భ‌యం క‌నిపించ‌లేద‌ని, వారు త‌న‌ని ఏమీ చూడ‌నివ్వ‌లేద‌ని,  ప‌ని పూర్తి కాగానే అక్క‌డి నుంచి వెంట‌నే వెళ్లిపొమ్మ‌న్నార‌ని, లోప‌ల మృత దేహం వుంద‌న్న విష‌యం త‌న‌కు తెలియ‌ద‌ని, ఆ త‌రువాత త‌న‌కు పోలీసులు ఫోన్ చేయ‌డంతో త‌ను వెళ్లింది సుశాంత్ ఇంటిక‌ని తెలిసింద‌ని లాక్‌స్మిత్ సంచ‌ల‌న విష‌యాల్ని వెల్ల‌డించారు.

- Advertisement -

అయితే సుశాంత్ బెడ్ రూమ్‌లో వున్న ఆ న‌లుగురు ఎవ‌ర‌న్న‌ది ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. లాక్‌స్మిత్ చెప్పిన విష‌యాలని బ‌ట్టి చూస్తే సుశాంత్ హ‌త్య‌కు గురైన‌ట్టుగా తెలుస్తోంది. తాజాగా ఈ కేసుని సీబీఐ ఇన్వెస్టిగేష‌న్ చేస్తున్న విష‌యం తెలిసిందే అయితే సుశాంత్ పోస్ట్ మార్ట‌మ్ రిపోర్ట్‌లో టైమ్ మిస్సింగ్ కావ‌డం క‌ల‌క‌లం రేపుతోంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All