Homeటాప్ స్టోరీస్ఈ భామ శింబు పైనే ఆరోపణలు చేసిందా ?

ఈ భామ శింబు పైనే ఆరోపణలు చేసిందా ?

lekha washingtonహీరోయిన్ లేఖా వాషింగ్టన్ తనపై కూడా లైంగిక వేధింపులు జరిగాయని పేర్కొంటూ తమిళ హీరో శింబు నటించిన చిత్రం పేరు ” కెట్టవన్ ” ని పేర్కొంటూ హ్యాష్ ట్యాగ్ చేసింది . అంటే శింబు ని ఇన్ డైరెక్ట్ గా నన్ను వేదించాడు అని చెప్పకనే చెబుతోంది . లేఖా వాషింగ్టన్ హ్యాష్ ట్యాగ్ చేయడంతో వెంటంటే నాకు ఎలాంటి సంబంధం లేదు , లేఖ అలా ఎందుకు ట్యాగ్ చేసిందో తెలీదు అంటూ శింబు కార్యాలయం నుండి తిరుగు సమాధానం కూడా వచ్చేసింది అంటే తెరవెనుక ఏదో జరిగింది అన్నది మాత్రం వాస్తవం . శింబు సరసన లేఖా వాషింగ్టన్ కెట్టవన్ అనే చిత్రంలో నటించింది . ఆ సమయంలోనే ఇద్దరికీ ఏదో జరిగింది . దాంతో మీటూ ఉద్యమం భారత్ లో ఊపందుకోవడంతో ఇలా హ్యాష్ ట్యాగ్ చేసి ఉంటుందని అనుకుంటున్నారు .

ఇక ఆ వ్యవహారం అలా ఉండగా శింబు ఫ్యాన్స్ మాత్రం లేఖా వాషింగ్టన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు . మీటూ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడానికి మా హీరో మీద నిందలు వేస్తావా ? అంటూ లేఖా వాషింగ్టన్ పై నిప్పులు చెరుగుతున్నారు శింబు ఫ్యాన్స్ . అన్నట్లు ఈ భామ తెలుగులో కూడా నటించింది . అల్లు అర్జున్ , మంచు మనోజ్ లు కలిసి నటించిన వేదం చిత్రంలో నటించింది లేఖా వాషింగ్టన్ . తెలుగు , తమిళ , హిందీ బాషలలో నటించిన ఈ భామ ఇప్పుడు హాయిగా పెళ్ళి చేసుకొని సంసార జీవితాన్నిఆస్వాదిస్తోంది . అయితే ఇప్పుడు మీటూ అంటూ ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది .

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All