Homeటాప్ స్టోరీస్తెలంగాణలో లగడపాటి జోస్యం ఎలా ఉందంటే

తెలంగాణలో లగడపాటి జోస్యం ఎలా ఉందంటే

Lagadapati Rajagopal comments goes viral on telangana electionsతెలంగాణలో ఎన్నికలు సమీపించిన తరుణంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ జోస్యం చెప్పాడు . అయితే మొత్తం ఫలితాలపై నోరు మెదపలేదు కానీ సంచలన ఫలితాలు మాత్రం రాబోతున్నాయని స్ఫష్టం చేసాడు . తెలంగాణ మొత్తం మీద 8 నుండి 10 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు విజయం సాధిస్తారని అందులో ఇద్దరినీ శాంపిల్ గా ప్రకటించాడు లగడపాటి . ఇంతకీ తెలంగాణ ఎన్నికల్లో గెలిచే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరో తెలుసా …….. నారాయణ్ పేట్ లో శివకుమార్ రెడ్డి , బోధ్ లో అనిల్ జాదవ్ . ఈరోజు ఈ ఇద్దరినీ ప్రకటించాడు . వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళు అయితే టికెట్ రాకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు .

ఇంతేకాదు ప్రతీ రోజు కి ఇద్దరి అభ్యర్థుల చొప్పున వెల్లడిస్తానని కూడా ప్రకటించాడు . తెలంగాణ లో ఎవరు గెలవబోతున్నారు అన్నది మాత్రం ఇప్పుడే చెప్పనని డిసెంబర్ 7న వెల్లడిస్తానని , ఇంకా నా మనుషులు సర్వే చేస్తూనే ఉన్నారని సర్వేలో ఆశ్చర్యకరమైన ఫలితాలు రాబోతున్నాయని అంటున్నాడు లగడపాటి . అంటే ఏతా వాతా చెప్పేదేంటంటే కేసీఆర్ ఓడిపోతున్నట్లు ఇన్ డైరెక్ట్ గా చెబుతున్నాడన్న మాట లగడపాటి .

- Advertisement -

English Title: Lagadapati Rajagopal comments goes viral on telangana elections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All