కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి ప్రమాణ స్వీకారం చేసారు . ఈరోజు బెంగుళూర్ లో జరిగిన వేడుకలో ఆ రాష్ట్ర గవర్నర్ వజూభాయ్ వాలా ప్రమాణ స్వీకారం చేయించారు . కుమారస్వామి తో పాటు ఉప ముఖ్యమంత్రి గా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అధ్యక్షుడు బి . పరమేశ్వర ప్రమాణం చేసారు . కాగా ఈ వేడుకకు భారతీయ జనతా పార్టీ ని ,ప్రధాని మోడీ ని వ్యతిరేకించే నాయకులు పెద్ద ఎత్తున తరలిరావడంతో బీజేపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి .
విపరీతమైన నాటకీయ పరిస్థితుల మధ్య అనూహ్యంగా జేడీఎస్ కు చెందిన కుమారస్వామి కర్ణాటక ముఖ్యమంత్రి అయ్యారు . జేడీఎస్ కు కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతు ఇవ్వడంతో ఈ కూటమి అధికారంలోకి వచ్చింది అయితే కుమారస్వామి తో పాటు పరమేశ్వర మాత్రమే ప్రమాణ స్వీకారం చేసారు . ఇక పూర్తిస్థాయి మంత్రివర్గం మాత్రం శాసనసభలో బలనిరూపణ అయ్యాకే అని అంటున్నారు . కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి సోనియా గాంధీ , రాహుల్ గాంధీ , చంద్రబాబు నాయుడు , మమతా బెనర్జీ , అరవింద్ కేజ్రీవాల్ , శరద్ యాదవ్ , సీతారాం ఏచూరి , శరద్ పవార్ , అఖిలేష్ యాదవ్ ,అజిత్ సింగ్ , తేజస్వి యాదవ్ , పినరయి విజయన్ తదితరులు హాజరయ్యారు .