సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం `ఉప్పెన`. మైత్రీ మూవీ మేకర్స్తో కలిసి సుకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సుక్కు శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇక ఇదే చిత్రంతో కన్నడ హీరోయిన్ క్రితి శెట్టి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. ఏప్రిల్ లో ఈ మూవీ రిలీజ్ కావాల్సి వుంది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఇదిలా వుంటే ఈ సినిమాకు సంబంధించిన పాటలు ఇప్పటికే యూట్యూబ్లో పాపులర్ అయ్యాయి. మిలియన్ల వ్యూస్ని సాధించి కొత్త రికార్డుని సాధించాయి.
తొలి చిత్రంలో తన కళ్లతోనే కోటి భావాలని పలకించిన క్రితి శెట్టిపై ఇండస్ట్రీ వర్గాల దృష్టిపడింది. దీంతో ఆమెకి క్రేజీ ఆఫర్లు తలుపు తడుతున్నాయి. తాజాగా ఓ బంపర్ ఆఫర్ క్రితి శెట్టిని వరించింది. నేచురల్ స్టార్ నాని సరసన నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. యాక్షన్ థ్రిల్లర్ `వి` తరువాత నాని నటిస్తున్న పిరియాడిక్ ఫిల్మ్ `శ్యామ్ సింగ రాయ్`.
`ట్యాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంక్రీత్యన్ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో నానికి జోడీగా ముగ్గురు హీరోయిన్లు నటించనున్నారు. అందులో ఓ హీరోయిన్గా క్రితి శెట్టిని చిత్ర బృందం ఎంపిక చేసింది. కీలకమైన పాత్రలో మెయిన్ హీరోయిన్గా ఇప్పటికే సాయి పల్లవిని ఎంపిక చేసుకున్నారు.