కళ్లతో కోటి భావాలు పలికించే అభినయం క్రితిశెట్టి సొంతం. ఈ కన్నడ సోయగం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ ఫేవరేట్. మెగా మేనల్లుడు సాయిధరమ్తేజ్ సోదరుడు వైష్ణవ్తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం `ఉప్పెన`. ఈ చిత్రం ద్వారా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. ఈ మూవీ ద్వారా కన్నడ సుందరి క్రితిశెట్టి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది.
కరోనా కారణంగా తొలి మూవీ రిలీజ్ ఇప్పటికీ వాయిదా పడుతున్నా క్రితిశెట్టికి మాత్రం టాలీవుడ్లో వరుస ఆఫర్లు పలకరిస్తున్నాయి. `ఉప్పెన` త్వరలో విడుదలకు సిద్ధమౌతోంది. ఈ నేపథ్యంలో క్రితిశెట్టికి హీరో నాని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తను నటిస్తున్న `శ్యామ్ సింగరాయ్` చిత్రంలో హీరోయిన్గా నటించే అవకాశం ఇచ్చారు. ఇటీవలే డీల్ కూడా ఫినిష్ అయింది. అఫీషియల్గా ప్రకటించారు కూడా.
అయితే తన తొలి చిత్రం విడుదల కాకుండానే తనకు టాలీవుడ్లో భారీ డిమాండ్ ఏర్పడటంతో ఒక్కసారిగా తన రెమ్యునరేషన్ని క్రితిశెట్టి భారీగా పెంచేసిందట. తన వద్దకు వచ్చే నిర్మాతలకు 70 లక్షలు డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంత ఎర్లీ స్టేజ్లో ఈ స్థాయిలో డిమాండ్ చేయడం కరెక్ట్ కాదేమో.. అది క్రితి కెరీర్ పై ప్రభావం చూపించే అవకాశం వుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.