మిర్చి , శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ ఇలా వరుసగా మూడు సినిమాలు చేసి మూడు బ్లాక్ బస్టర్ లు అందుకున్న దర్శకుడు కొరటాల శివ తాజాగా మహేష్ బాబు మళ్ళీ భరత్ అనే నేను సినిమా చేసున్నాడు . ఆ సినిమాని ఏప్రిల్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . కాగా ఆ సినిమా తర్వాత కొరటాల శివ ఏ హీరోతో సినిమా చేయనున్నాడో తెలుసా ……. అల్లు అర్జున్ తో . కామన్ గా అయితే రాంచరణ్ తో సినిమా చేయాలి ఎందుకంటే ఆల్రెడీ అది ప్రారంభోత్సవం జరుపుకుంది కానీ రెగ్యులర్ షూటింగ్ మాత్రం ఇప్పట్లో అయ్యేలా లేదు ఎందుకంటే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – చరణ్ లు నటించనున్న సినిమా దసరా కు సెట్స్ పైకి వెళ్లనుంది కాబట్టి .
అంటే రాజమౌళి తో చేసే మల్టీస్టారర్ సినిమా కంప్లీట్ చేసాక కొరటాల శివ సినిమా చేయాలి అంటే సంవత్సరం పైనే పడుతుంది దాంతో ఈలోపు అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు కొరటాల . ఇక అల్లు అర్జున్ కూడా కొరటాల శివ పట్ల సానుకూలంగా ఉన్నాడు . త్వరలోనే ఈ కాంబినేషన్ లో సినిమా అని అనౌన్స్ మెంట్ రాబోతోంది .