Homeటాప్ స్టోరీస్కేసీఆర్ పై నిప్పులు చేరగనున్న కొండా సురేఖ

కేసీఆర్ పై నిప్పులు చేరగనున్న కొండా సురేఖ

Konda surekha angry on kcrవరంగల్ ఈస్ట్ తాజా మాజీ ఎం ఎల్ ఏ కొండా సురేఖ తెలంగాణా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కెసిఆర్ పై నిప్పులు చెరగనున్నట్లు సమాచారం . కేసిఆర్ ఇటీవల ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో కొండా సురేఖ పేరు లేకపోవడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది . దాంతో తన భవిష్యత్ కార్యాచరణ కోసం ఈరోజు మద్యాహ్నం 12 గంటలకు ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది దాంతో అక్కడ ఏమి మాట్లాడబోతోందో అన్న ఆత్రుత నెలకొంది . కొండా సురేఖ సన్నిహితుల సమాచారం బట్టి కెసిఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరగడం ఖాయమని , తెలంగాణ ప్రభుత్వంలో ఒక్క మహిలని కూడా మంత్రిగా నియమించలేని సర్కార్ ఈ కెసిఆర్ అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం ఖాయమని అంటున్నారు .

వరంగల్ జిల్లా లో కొండా దంపతులకు మంచి పట్టు ఉంది , పర్కాల , భూపాల్ పల్లి , వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో కొండా దంపతులకు పెద్ద ఎత్తున అనుచర వర్గం ఉంది దాంతో వాళ్ళ ఒత్తిడి కూడా అధికం కావడంతో ఈరోజు కెసిఆర్ ప్రభుత్వం పై విమర్శలు చేసి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది . కొండా దంపతులు ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ లో ఉండటంతో మళ్ళీ మాతృ సంస్థ లోకి చేరనున్నట్లు తెలుస్తోంది .

- Advertisement -

English Title: konda surekha angry on kcr

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All