దర్శకధీరుడు రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తర్వాత తన నెక్స్ట్ సినిమా మహేష్ బాబుతో ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే. సెట్స్ మీదకు వెళ్లకుండానే ఈ సినిమాలో కాస్ట్ అండ్ క్రూ గురించి వార్తలు మొదలయ్యాయి. ఈ క్రమంలో మహేష్, జక్కన్న కాంబో విలన్ గా కోలీవుడ్ స్టార్ హీరో విలన్ నటిస్తాడని లేటెస్ట్ టాక్. ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కాని అదే నిజమైతే మాత్రం కాంబినేషన్ అదిరిపోతుందని చెప్పొచ్చు.
రాజమౌళి, మహేష్ కాంబో సినిమా స్పై థ్రిల్లర్ గా ఉండబోతుందని అర్ధమవుతుంది. జేమ్స్ బాండ్ తరహాలో ఒక కథ సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. మహేష్ ప్రస్తుతం చేస్తున్న సర్కారు వారి పాట, త్రివిక్రం తో మరో సినిమా పూర్తి చేసి రాజమౌళి సినిమాకు సిద్ధం కానున్నాడు. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ సినిమాల్లానే ఈ సినిమా కూడా పాన్ ఇండియా మూవీగా మహేష్ స్టామినాని మరింత పెంచే అవకాశం ఉందని చెప్పొచ్చు.