‘రాజావారు రాణిగారు’ .. ‘ఎస్.ఆర్. కల్యాణ మంటపం’ వంటి సినిమాలతో వరుస విజయాలు అందుకొని, యూత్ ను ఆకట్టుకున్న కిరణ్ అబ్బవరం లేటెస్ట్ గా సెబాస్టియన్ PC 524 మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా బాగున్నప్పటికీ సరైన టైం లో రిలీజ్ చేయకపోయేసరికి ప్రేక్షకులు పెద్దగా ఇంట్రస్ట్ చూపించలేదు.
ఇదిలా ఉంటె తాజాగా ఈ యంగ్ హీరో కు అగ్ర సంస్థ నుండి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తుంది. వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో దూసుకెళ్తున్న మైత్రి మూవీ మేకర్స్..అగ్ర హీరోలతో పాటు చిన్న హీరోలతో కూడా సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కిరణ్ తో 9 కోట్లతో ఓ మూవీ చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ రెడీగా ఉన్నట్లు ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాను ప్రకటించనున్నారని అంటున్నారు.
ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో పుష్ప 2 , మహేష్ సర్కారువారి పాట, సుధీర్ బాబు ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, బాలకృష్ణ 107వ సినిమా, మెగాస్టార్ బాబీ మూవీ , పవన్ కళ్యాణ్ – హరీష్ శంకర్ ల మూవీస్ తెరకెక్కుతున్నాయి.