Homeగాసిప్స్మ‌హేష్‌తో మ‌రోసారి జోడీక‌డుతోంది!

మ‌హేష్‌తో మ‌రోసారి జోడీక‌డుతోంది!

మ‌హేష్‌తో మ‌రోసారి జోడీక‌డుతోంది!
మ‌హేష్‌తో మ‌రోసారి జోడీక‌డుతోంది!

మ‌హేష్‌బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం `స‌ర్కారు వారి పాట‌`. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీమేక‌ర్స్, 14 ప్ల‌స్ రీల్స్‌, జీఎంబీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌ల సూప‌ర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ని, మ‌హేష్ ప్రీలుక్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.

ప్ర‌స్తుతం ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని స్టిల్స్ సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. పోకిరి త‌ర‌హా లుక్‌తో మాసీవ్‌గా మ‌హేష్ క‌నిపిస్తున్న తీరు ఫ్యాన్స్‌ని, నెటిజ‌న్స్‌ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. భార‌తీయ బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌పై వ్యంగ్యాస్త్రంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న‌ట్టు తెలుస్తోంది. వ‌రుస షూటింగ్‌ల‌తో బిజీగా వున్నా కియారా తెలుగు సినిమా కావ‌డం, మ‌రో సారి ప్రిన్స్ మ‌హేష్ ప‌క్క‌న కావ‌డంతో వెంట‌నే ఓకే చెప్పిన‌ట్టు తెలిసింది.

- Advertisement -

మ‌హేష్ న‌టించిన `భ‌ర‌త్ అనే నేను` చిత్రంతో ‌కియారా అద్వానీ తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయిన విష‌యం తెలిసిందే. `స‌ర్కారు వారి పాట‌`వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో వ‌స్తున్న రెండ‌వ సినిమా కావ‌డంతో ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఫీల‌వుతున్నార‌ట‌. త్వ‌ర‌లోనే ఈ చిత్ర రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All