యశ్, శ్రీనిథి శెట్టి జంటగా నటించిన సినిమా కేజియఫ్. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం అనుకున్నట్లుగానే డిసెంబర్ 21నే విడుదల కానుందని దర్శక నిర్మాతలు తెలిపారు. తెలుగులో ఈ చిత్ర హక్కులను సాయి కొర్రపాటి తీసుకున్నారు. వారాహి చలనచిత్రం బ్యానర్ లో కేజియఫ్ సినిమాను విడుదల చేస్తున్నారు సాయి కొర్రపాటి.
అనివార్య కారణాలతో కేజియఫ్ సినిమా అనుకున్న సమయానికి విడుదల కావడం లేదని.. డిసెంబర్ 21 నుంచి ఈ చిత్రం వాయిదా పడిందని వస్తున్న వార్తలను నిర్మాత సాయి కొర్రపాటి ఖండించారు. ఈ చిత్రం అనుకున్న సమయానికి.. అనుకున్నట్లుగా విడుదల అవుతుందని తెలిపారు ఆయన. డిసెంబర్ 21న తెలుగుతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది ఈ చిత్రం. కోలార్ గోల్డ్ మైన్స్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు దర్శకుడు ప్రశాంత్ నీల్.